ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.ఈ టోర్నమెంట్ కి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలయింది.
ఈ టోర్నీ ఈ నెల 20 నుంచి ఓమన్ వేదికగా జరగనుంది.ఈ టోర్నీలో ఇండియన్ మహారాజా, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్లు పాల్గొంటున్నాయి.
ఇందులో భాగంగా ఈ టోర్నీలో పాల్గొనబోయే టీమ్స్ యొక్క కెప్టెన్ల పేర్లను ప్రకటించారు.అయితే ఇండియా నుండి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించే టీమ్ కు కెప్టెన్గా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరించనున్నాడు.
ఇక వైస్ కెప్టెన్ గా మహ్మద్ కైఫ్ నియమితుడవ్వగా.ఈ టీమ్ కు కోచ్ గా ఆసిస్ మాజీ ప్లేయర్ జాన్ బుచనన్ వ్యవహరించనున్నాడు.
ఈ టోర్నీలో ఆడబోయే మరో రెండు జట్లు.ఆసియా లయన్స్కు సారథిగా మిషబ్ ఉల్ హక్ ఎంపికయ్యారు.ఇక వైస్ కెప్టెన్గా తిలకరత్నె దిల్షాన్, కోచ్గా అర్జున వ్యవహరించనున్నారు.మరో టీమ్ వరల్డ్ జెయింట్స్కు సారథిగా డారెన్ సామీ ఎంపిక అవ్వగా… జాంటీ రోడ్స్ మెంటార్గా వ్యవహరించనున్నారు.
ఈ టీమ్ లో షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, చమిందా వాస్, హబీబుల్ బషర్ లు ఆడనున్నారు.
ఈ లీగ్లో భారత్ తరపున సెహ్వాగ్, కైఫ్ తో పాటు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, అమిత్ భండారి,నయన్ మోంగియా ఆడనున్నట్లు సమాచారం.జనవరి 20న ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియా లయన్స్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది.మ్యాచ్లన్నీ సోనీ టెన్ 1, 2, 3లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.