తిరుపతికి చెందిన పవన కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త వినోద్ రాయల్ హత్య తెలుగు రాష్ట్రల మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.దాదాపు ప్రతి న్యూస్ ఛానెల్ దీన్ని అభిమానుల మధ్య జరిగిన గొడవ వలన జరిగిన హత్యగానే చూపెడుతోంది.
కాని ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే పవన్ ని చంపింది ఎన్టీఆర్ అభిమానేనా?
అపుడెప్పుడో ఎన్టీఆర్ – కృష్ణ అభిమానుల మధ్య జరిగిన గొడవలో అప్పటికప్పుడు హత్యలు జరిగాయి.కాని వినోద్ కేసులో అలా కాదు.
ముందు తిరుపతి నుంచి ఇద్దరు బయలుదేరారు, కోలార్ లో ముగ్గురయ్యారు మళ్ళీ తిరిగి వస్తుండగా నలుగురయ్యారు.
తిరిగివస్తుండగా తల్లితో ఫోన్లో మాట్లాడిన వినోద్, ఇంటికే వస్తున్నానని చెప్పాడు.
చికెన్ వండమని కూడా చెప్పిన వినోద్ ని దారి మధ్యలో ఆపి, ఎవరులేనిది చూసి కత్తితో పొడవడానికి మరో హీరో మీద అభిమానమే కారణమా?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారమైతే ఇది అభిమానులు మధ్య గొడవ వలన జరిగిన మర్డర్ కాదని తెలుస్తోంది.కత్తితో పొడిచిన అక్షయ్ అసలు ఎన్టీఆర్ ఫ్యాన్ కానే కాదని, అతని మీద ఇంతకుముందు కూడా కొన్ని కేసులున్నాయని ఓవైపు నుంచి సమాచారం.
ఇలాగైతే ఎన్టీఆర్ అభిమానులైన త్రినాథ్, సునీల్ లకు ఈ మర్డర్ తో పెద్దగా సంబంధం లేదని అనిపిస్తోంది.
కాని వినోద్ తండ్రి మాత్రం ఇది ప్లాన్డ్ గా చేసిన పని అని, త్రినాథ్, సునీల్ లను కూడా వదలకూడదు అని డిమాండ్ చేస్తున్నారు.
చంపింది అక్షయ్ అయితే త్రినాథ్, సునీల్ ఆపడానికి ప్రయత్నించలేదా అనే ప్రశ్న ఒకవైపు, మరి రక్తం మడుగులో ఉన్న వినోద్ ని వైద్యం కోసం తరలించింది త్రినాథ్, సునీల్ అయితే, వారికి వినోద్ ని కాపాడాలని ఉన్నట్లేగా అనే ప్రశ్న మరోవైపు.నిజానిజాలేంటో పోలిస్ విచారణలోనే తేలాలి.