రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియతో ఏదైనా జరిగే అస్కారం ఉండటంతో రాజ్యసభకు మరో అభ్యర్ధిగా సునందా రెడ్డితో నామినేషన్ .దాఖలు చేయించింది వైసీపీ.
మంగళవారం నామినేషన్ దాఖలు చివరిరోజు కావటంతో వైకాపా విజయసాయిరెడ్డి అభ్యర్ధన మేరకే ఆతని భార్యతో నామినేషన్ వేయించినట్టు సమాచారం.ఇప్పటికే జగన్తో పాటు పలు కేసులలో నిందితుడుగా ఉన్నవిజయ సాయిరెడ్డి నామినేషన్ను తిరస్కరించేందుకు తెలుగుదేశం పార్టీ ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోనుందని, ఈ క్రమంలోనే కొందరు దేశం నేతలు విజయ సాయిరెడ్డి నిందితుడిగా ఉన్న పలు కేసుల వివరాలు ఎన్నికల అధికారికి అందజేసారని, వాటిని నామినేషన్ ప్ర్రక్రియలో పరిశీలించుకునే ఆస్కారం ఉందని, సాయిరెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా తెలుగుదేశం వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైన సమాచారం రావటంతో సునందా రెడ్డితో నామినేషన్ వేయించినట్లు వినవస్తోంది.
కాగా సునంద కేవలం నామినేషన్ల పరిశీలన వరకే తమ పార్టీ తరపున అభ్యర్ధిగా రంగంలో ఉంటారని, పరిశీలన తదుపరి పరిస్ధితి దృష్ట్యా ఆమె తన పోటీ నుంచి వైదొలగుతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి