తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ‘చేసింది శూన్యం’ అని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అలియాస్ విహెచ్ విమర్శించారు.
కేసీఆర్ మెప్పు కోసమే మంత్రులు కాంగ్రెసు పార్టీని, నాయకులను విమర్శిస్తున్నారని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు.
కాంగ్రెసు పార్టీని విమర్శస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలా పరిపాలన చేయాలో తెలియదని అన్నారు.ప్రభుత్వం పేదలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇళ్లు కట్టొద్దని, సెజ్ల్లోని ఖాళీ భూముల్లో కట్టాలని సూచించారు.
ఉస్మానియా విద్యార్థులను మెచ్యూరిటీ లేనివారిని అవహేళన చేయడం మంచిదికాదన్నారు.ప్రజలు ఎన్నో ఆశలతో టీఆర్ఎస్కు అధికారం అప్పగిస్తే వారి ఆశలను వమ్ము చేసిందని, ఏ పనీ చేయలేదని దుయ్యబట్టారు.
ఈయన విమర్శలకు టీఆర్ఎస్ నాయకులు ఏమంటారు? సర్కారు నిలదొక్కువోడానికే ఏడాది పట్టిందని, కాంగ్రెసు హయాంనాటి సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నామంటారు.ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటిలోగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటారు.
కాంగ్రెసు అధికారంలో ఉన్నా ఇలాగే చెబుతుంది.