గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో ‘జగన్మోహన్ ఐపీఎస్’ సినిమా ఆగిపోయి మళ్లీ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
అదేంటంటే ఈ సినిమాలో లేడీ అమితాబచ్చన్గా పేరు తెచ్చుకున్న నిన్నటి తరం హీరోయిన్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటించబోతుంది.దర్శకుడు బి.గోపాల్ మరియు విజయశాంతికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ కారణంగానే ఈ సినిమాలో విజయశాంతి నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయాలతో ఇన్నాళ్లు బిజీగా ఉన్న విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.అయితే ఇటీవల ఎన్నికల్లో ఈమె కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడి పోయింది.
దాంతో ఈమె రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉంటుంది.ఎన్నికల తర్వాత విజయశాంతి సినిమాల్లో నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
అయితే ఇన్నాళ్లకు విజయశాంతి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక మీదట కూడా విజయశాంతి మంచి పాత్రలు వస్తే వరుసగా సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పవచ్చు అని అంటున్నారు.