దర్శకుడిని మార్చేశాడు

‘బెంగళూరు డేస్‌’ సినిమాను దిల్‌ రాజు మరియు ప్రసాద్‌ వి పొట్లూరిలు తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ఈ రీమేక్‌కు మొదట బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తాడు అనే ప్రచారం జరిగింది.

 Venu Sriram To Direct Bangalore Days Remake-TeluguStop.com

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్‌కు దర్శకుడు మారి పోయినట్లుగా తెలుస్తోంది.‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

‘ఓ మై ఫ్రెండ్‌’ తర్వాత వేణు శ్రీరాం మరే సినిమా చేసింది లేదు.దిల్‌రాజు ప్రొడక్షన్‌ టీంలో చాలా కాలంగా ఉంటూ వస్తున్న వేణు శ్రీరామ్‌పై ఉన్న నమ్మకంతోనే దిల్‌రాజు ఈ బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తోంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తాడు అని మొదట అన్నా కూడా ఆయనపై నమ్మకాన్ని నిర్మాతలు ఉంచలేదు.అందుకే చివరి నిమిషంలో దర్శకుడు మారాడు.

ఇక ఈ రీమేక్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మరియు శర్వానంద్‌లు హీరోలుగా నటించనున్నారు.అలాగే ఈ సినిమాకు హీరోయిన్‌గా శ్రీదివ్యను ఎంపిక చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube