వెంకటేష్, మారుతిల కాంబినేషన్లో ‘రాధా’ చిత్రం ప్రారంభం అయ్యి ఆగిపోయిన విషయం తెల్సిందే.కథ వివాదాస్పదం అవ్వడంతో ‘రాధా’ చిత్రాన్ని అటకెక్కించిన విషయం తెల్సిందే.
తాజాగా మారుతి ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్నాడు.దాంతో వెంకీ నుండి మారుతికి పిలుపు వచ్చిందని, మళ్లీ ‘రాధా’ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.
కాని తాజాగా మారుతి మీడియాతో మాట్లాడుతూ ‘రాధా’ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మారుతి త్వరలో ఒక కొత్త కథను రెడీ చేస్తాను అని, ఆ కథతో యువ హీరోతో సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
మారుతి ఈ మాటలతో ‘రాధా’ చిత్రం లేనట్లే అని క్లారిటీ వచ్చేసింది.గత కొన్ని రోజులుగా వస్తున్న ‘రాధా’ వార్తలకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.
అతి త్వరలోనే మారుతి తన కొత్త చిత్రాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఆ యువ హీరో ఎవరు అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది.