‘గోపాల గోపాల’ సినిమా తర్వాత వెంకటేష్ నటించబోతున్న సినిమాపై ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది.ఈయన గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు.
దాంతో ఈ గ్యాప్లో ఈయన తర్వాత సినిమాపై పలు రకాల పుకార్లు షికారు చేశాయి.ఎందరో దర్శకులతో ఈయన సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.
కాని చివరకు ఈయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడు.ఆ సినిమాకు ‘సంతోషం సగం బం’ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది.
‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ తాజాగా వెంకటేష్తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఇప్పటికే క్రాంతి మాధవ్ చెప్పిన కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాలో హాట్బ్యూటీ నయనతార హీరోయిన్గా నటించబోతుంది.వెంకీ, నయన్ల కాంబినేషన్లో గతంలో ‘తులసి’ మరియు ‘లక్ష్మి’ సినిమాలు వచ్చాయి.
మళ్లీ ఇప్పుడు మూడవ సారి వీరి కాంబో మూవీ రాబోతుంది.ఈ సినిమాను ‘సింహా’, ‘షాడో’, ‘నా ఇష్టం’ సినిమాలను నిర్మించిన పరుచూరి కిరిటీ నిర్మించబోతున్నాడు.
వచ్చే నెల 14న ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.