విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం “గురు” అనే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజిగా ఉన్నారు.సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలివుడ్ లో వచ్చిన సాలా ఖడూస్ చిత్రానికి రీమేక్.
అయితే అక్కడా ఇక్కడా, దర్శకురాలు సుధనే కావడం విశేషం.గురు జనవరి చివర్లో విడుదల కానుంది.
ఈ సినిమా సంగతి ఇలా ఉంటే, నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.“ఆడవాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ కన్ఫర్మ్ అయిన ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
ప్రీ పోడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఆపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న క్యాష్ క్రంచ్ పరిస్థితులల్లో ఈ సినిమాని నిర్మించడం నిర్మాత రామ్ మోహన్ ని కష్టంగా అనిపిస్తోందని, అందుకే ఈ ప్రాజెక్టుని క్యాన్సల్ చేస్తున్నారని టాక్.
అయితే ఈ కారణంతో ఈ సినిమా పూర్తిగా ఆగిపోతుందా లేక నిర్మాత మారతాడా చూడాలి!
.