విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ ‘దృశ్యం’ మరియు ‘గోపాల గోపాల’ సినిమాలతో సక్సెస్లను సాధించాడు.ఈ ఉత్సాహంతోనే వెంకీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దశరధ్తో వెంకటేష్ సినిమా చేసేందుకు ఇప్పటికే ఒకే చెప్పాడనే వార్తలు మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే.అయితే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెళువడలేదు.
దాంతో ఆ సినిమాపై అనుమానాలు వచ్చాయి.అయితే తాజాగా ఆ సినిమాపై ఎలాంటి అనుమానాలు లేవని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరధ్ ప్రస్తుతం వెంకీ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని, త్వరలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే దసరాలోపు వెంకీ, దశరధ్ల సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
దశరధ్ అంటేనే కుటుంబ కథా చిత్రాలు.ఇక వెంకటేష్ కూడా ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా నటించి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ను కూడా తెచ్చుకున్నాడు.
అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కు పండుగే.