విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ సక్సెస్ మూవీ ‘పీకూ’ రీమక్పై ఆశలు పెట్టుకున్నాడని, అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని టాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.అయితే వెంకీ ఈ రీమేక్ చేయడం ఆయన అభిమానులతో పాటు, సినీ వర్గాల్లో పలువురికి ఇష్టం లేదు.
ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసి వెంకీ బొక్క బోర్లా పడ్డాడు.‘ఈనాడు’, ‘గోపాల గోపాల’, ‘మసాలా’ సినిమాలు బాలీవుడ్ నుండి దిగుమతి అయినవే.
ఈ మూడు సినిమాలు కూడా వెంకీకి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేక పోయాయి.ఇక తాజాగా వెంకీ ‘పీకూ’ సినిమా చేస్తాను అనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చిన ‘పీకూ’ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం లేదు.తెలుగు నేటివిటీకి ఈ సినిమా కథ చాలా దూరంగా ఉంటుంది.
దాంతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్ర అమితాబచ్చన్ పోషించాడు.ఆ పాత్రలో వెంకీ నటించడం కుదరని విషయం.
ఇక మరో పాత్రలో ఇర్ఫాన్ కనిపించాడు.ఈయన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.
దాంతో ఈ ఇద్దరిలో ఎవరి పాత్రను పోషిస్తే వారి పాత్రకు ప్రాముఖ్యత కల్పించాల్సి ఉంటుంది.అలా చేస్తే సినిమా కథ మొత్తం మార్పు చేయాల్సి ఉంటుంది.
ఇన్ని సమస్యల మధ్య ‘పీకూ’ సినిమాను రీమేక్ చేయడం కంటే ఊరికే ఉండటం ఉత్తమం అని వెంకీకి సన్నిహితులు సలహా ఇస్తున్నారు.మరి వెంకీ ఆ సలహాలను తీసుకుంటాడా అనేది చూడాలి.