‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ అమ్మడు ఓవర్ నైట్లోనే స్టార్ హీరోయిన్ అయ్యి పోయింది.
ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాల జాబితా చెబితే అవును ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ అనక తప్పదు.రామ్చరణ్, ఎన్టీఆర్, మహేష్బాబు, రవితేజ, నితిన్ వంటి హీరోలతో ఈమె సినిమాలు చేస్తోంది, చేయబోతుంది.
దాంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు ఈమెను హీరోయిన్గా బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈమె తన పారితోషికాన్ని ఏకంగా డబుల్ చేసింది.
నితిన్ సరసన హీరోయిన్గా నటించేందుకు ఈమె ఏకంగా కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసిందని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా తన పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలపై ఈ అమ్మడు స్పందించింది.తాను హీరోలతో సమానంగా పారితోషికం పొందాలని కోరుకుంటాను.
కాని హీరోలు ఒక్క సినిమా చేసే సమయంలో హీరోయిన్లు మూడు నాలుగు సినిమాలు చేసేయోచ్చు.కాని అంత పారితోషికం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు.
అయితే ప్రస్తుతం తనకు ఇచ్చే పారితోషికంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పింది.అయితే ఈమె తీసుకునే పారితోషికం ఎంతా అనే విషయం మాత్రం చెప్పలేదు.
కోటి తీసుకుంటుందా? అంతకు మించి తీసుకుంటుందా? లేక అంతకు లోపలకు తీసుకుంటుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.