సినీనటి జ్యోతిలక్ష్మి ఇక లేరు..!

తెలుగు సినిమాకు ఐటం సాంగ్ కలర్ అద్దిన బుట్టబొమ్మ జ్యోతిలక్ష్మి ఈరోజు తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు.ఎన్.

 Jyothi Lakshmi Is No More-TeluguStop.com

టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అలనాటి సూపర్ హీరోలందరితో ఆడి పాడిన జ్యోతిలక్ష్మి దాదాపు 300 సినిమాలకు పైగా నటించి మెప్పించారు.కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న జ్యోతిలక్ష్మి చెన్నైలో మరణించడం జరిగింది.ముందు తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా పిల్లా పిడుగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇక ఇక్కడ స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు జ్యోతిలక్ష్మి.

స్టార్ సినిమా ఏదైనా జ్యోతిలక్ష్మి పాట ఉంది అంటే సినిమా హిట్ అన్నట్టు పరిస్థితి ఉండేది.ఇక అదే ఊపుతో తన చెల్లి జయమాలినిని కూడా సినిరంగ ప్రవేశం చేయించిన జ్యోతిలక్ష్మి ఆమెకు రెడ్ కార్పెట్ వేయడం జరిగింది.

ఇక ఇద్దరు కలిసి ఆడి పాడిన సందర్భాలు ఉన్నాయి.కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా పైకి చెరగని చిరునవ్వుతో కనిపించిన జ్యోతిలక్ష్మి ఈరోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆమె మరణ వార్త విని టాలీవుడ్ సిని పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యింది.టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖులు జ్యోతి లక్ష్మి మృతి పట్ల తమ నివాళిలు ప్రకటించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube