అమెరికాలో దుండగులు రెచ్చిపోతున్నారు…ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు…అంతేకాకుండా అదే క్రమంలో అక్కడ స్థిరపడిన తెలుగువారిలో భయాందోళనలు కలిగిస్తున్నారు.వివరాల్లోకి వెళితే… అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది.
గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి.దక్షిణ సియాటిల్లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
గుడి కిటికీలను ధ్వంసం చేసి గుడి గోడలపై ‘ఫియర్’ అని ఆంగ్లంలో రాసి వెళ్ళిపోయారు.అయితే పలువురు భక్తులు పూజకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
ఇక దీనిపై అక్కడి ప్రవాసాంధ్రులు.ఎఫ్బీఐతో పాటు కెంట్ పోలీసులకు.
ఇక ఫిబ్రవరి నెలలో సియాటల్ శివారు ప్రాంతం బోతెల్లో కూడా హిందూ ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే.స్వస్తిక్తో పాటు గెట్ అవుట్ అని ఆలయ గోడలకు రాశారు.
మరి దీని వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
.