టాలీవుడ్లో సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్తో మరోసారి సినిమా చేసేందుకు వంశీ రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమాకు మహేష్ బాబు మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని చెప్పడంతో వంశీ ఆ సినిమా కథను మార్చే పనిలో పడ్డాడు.
తాజాగా వంశీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది సినిమా కోసం కాదని తెలుస్తోంది.అల్లు అరవింద్కు సంబంధించిన ఆహా డిజిటల్ ప్లాట్ఫాంలో పలు వెబ్ సిరీస్లను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ సరికొత్త వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేసేందుకు వంశీ పైడిపల్లిని సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చేశారు.అయితే ఈ వెబ్ సిరీస్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా వంశీ పైడిపల్లి చేయాలనుకున్న సినిమా ప్రారంభం కాలేదు, మరి ఈ వెబ్ సిరీస్నైనా ఆయన ప్రారంభిస్తాడా లేదా అనేది చూడాలి.కాగా మరో యంగ్ హీరో రామ్ చరణ్తో కూడా వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఆహా కోసం ఆయన ఎలాంటి వెబ్ సిరీస్నురెడీ చేస్తాడో చూడాలి.