‘రేసుగుర్రం’ చిత్రంతో రచయితగా సూపర్ హిట్ను అందుకున్నాడు వక్కంతం వంశీ.దాంతో ఈయనకు రచయితగా స్టార్ క్రేజ్ దక్కింది.
అయితే రచయితగా తన కెరీర్ను కాకుండా దర్శకుడిగానే ఈయన ఎక్కువ ఆశిస్తున్నాడు.అందుకే ఈయన స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
ఎన్టీఆర్ కోసం ఈ రచయిత ఒక కథను రాసుకున్నాడు.ఎన్టీఆర్కు ఆ కథ బాగా నచ్చింది, అయితే దర్శకత్వం వక్కంతం వంశీపై నమ్మకం లేక ఆ కథతో తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘టెంపర్’ చేశాడు.
తాజాగా వక్కంతం వంశీపై పలువురు యంగ్ హీరోలు దృష్టి పెట్టారు.
ఈ రచయితతో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఈ రచయిత మాత్రం తన మొదటి సినిమా స్టార్ హీరోతోనే ఉండాలని భావిస్తున్నాడు.అందుకే ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు.
‘టెంపర్’ ప్రారంభ సమయంలో ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అయితే తాజాగా ‘టెంపర్’ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ సుకుమార్కు ఓకే చెప్పాడు.
దాంతో వక్కంతం వంశీ మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.