బాలీవుడ్ బిగ్బి, సూపర్ స్టార్ అమితాబచ్చన్కు అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసింది.అమితాబచ్చన్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం అల్లర్లకు కారణం అయ్యాడంటూ సిక్కులు అమెరికా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
పిటీషన్ను స్వీకరించిన అమెరికా కోర్టు అమితాబచ్చన్కు నోటీసులు జారీ చేసింది.దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు అమితాబచ్చన్ ప్రతినిధికి అమెరికాలో నోటీసులు అందజేసింది.
ఈ నోటీసులపై 20 రోజుల్లో స్పందించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.కోర్టు నోటీసుపై అమితాబచ్చన్ ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే తప్పని సరిగా అమితాబచ్చన్ కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందే అని అక్కడి న్యాయ నిపుణులు అంటున్నారు.లేని పక్షంలో తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరి అమితాబ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.