మొన్నే, డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ జరిగింది.ఇంతలో అఖిల్ అక్కినేని – శ్రియా భూపాల్ తమ బంధానికి తెర దించుతారని ఎవరనుకున్నారు.
ఎవరు ఊహించని విధంగా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది.అంత యుక్త వయసులో ఇలాంటి నిర్ణయాలు మనం ఊహించేవే అయినా, అఖిల్ సినిమా హీరో కాబట్టి, మనం కూడా అక్కినేని వారి లాగే బాధపడుతున్నాం.
ఇక అక్కినేని కుంటుంబం, అక్కినేని అభిమానులు ఎంతలా బాధపడుతున్నారో.నాగార్జున అయితే ఎవరికి కనబడటం కూడా లేదు సరిగా.
అయితే, ఇంతమంది బాధల్ని తీర్చి, అఖిల్ – శ్రియలను తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట.ఇంతకి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి ఎవరనుకున్నారు .స్వయంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన.
కొణిదెల వారి కోడలు నాగార్జున ఫ్యామిలికి బాగా క్లోజ్ అని మనకు అల్రెడి తెలుసు.
కాని ఉపాసన కేవలం ఇటువైపే కాదు, అటువైపు జనాలకి కూడా బాగా కావాల్సిన మనిషే అంట.అందుకే, ఆమె రంగంలోకి దిగింది.ఇరువైపుల, తనకున్న సత్సంబంధాలతో, అఖిల్ – శ్రియలను తిరిగి ఒక్కటి చేసేందుకు యత్నిస్తోందట ఉపాసన.
మరి ఉపాసన పడుతున్న కష్టానికి మంచి ఫలితం దక్కి అఖిల్ – శ్రియ మళ్ళీ పెళ్ళకి ఒప్పుకుంటారో లేక వారి మధ్య వైరం అలానే ఉండి, పెళ్ళి పూర్తిగా క్యాన్సిల్ అవుతుందో చూడాలి.