దేశంలో కొంత కాలంగా గొడ్డు మాంసం మీద చర్చలు, వివాదాలు నడుస్తున్న నేపధ్యంలో ఓ ముస్లిం ఎమ్మెల్యే గోవుల రక్షణకు నడుం బిగించాడు.అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.
ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ పని చేస్తున్నాడు.జమీరుల్లా ఖాన్ అనే ఈ ఎమ్మెల్యే ఆలీఘర్ ప్రాంతానికి చెందివాడు.
ఈయన గాయే బచావో ఆందోలన్ ప్రారంభించారు.తన మతానికి చెందివారు ఎవరూ ఆవులను చంప వద్దని కోరుతున్నాడు.
తన ఉద్యమానికి ఇస్లాం మత పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పాడు.గోవులను చంపకూడదని , వాటి మాంసం అమ్మకూడదని మొట్ట మొదట తను ప్రతిజ్ఞ చేసానని చెప్పాడు.
ఇదే విషయం మిగతా ముస్లింలకు కూడా చెబుతున్నానని అన్నాడు.కొన్ని రోజుల కిందట ఒక గ్రామంలో గో వధ ఉద్రిక్తత కలిగించడంతో గోవులను చంపకూదడనే నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఎమ్మెల్యే చెప్పాడు.
హిందువులు గోవును పవిత్రంగా భావిస్తారని, ఆవును పెద్ద కొడుకులా చూస్తారని, కాబట్టి గోవును చంపితే వారి మనోభావాలు దెబ్బ తింటాయని అన్నారు.ప్రత్యామ్నాయంగా ఇతర జంతువులూ ఉన్నాయని, కాబట్టి గోవులను చంపాల్సిన అవసరం లేదన్నారు.
మంచి నిర్ణయం తీసుకున్న ఈ ఎమ్మెల్యేను హిందువులు అభినందిస్తున్నారు.
.