అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది.ఈమె హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిపోయింది.
తాజాగా ఈ అమ్మడు నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘సైజ్ జీరో’.ఈ చిత్రం కోసం అనుష్క ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈనెల 27న విడుదలకు ఏర్పాట్లు చేశారు.అంతా బాగానే ఉన్నా కూడా ఈ సినిమాకు సెన్సార్ పరంగా ఒక వింత అనుభవం ఎదురైంది.
తెలుగులో ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.సినిమాలో అనుష్క మరియు ఆర్యల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, అలాగే సొనాల్ చౌహాన్ ఎక్స్పోజింగ్ ఎక్కువయ్యింది అంటూ సెన్సార్ బోర్డు వారు ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.
అయితే తమిళ సెన్సార్ బోర్డు ఇందుకు విరుద్దంగా ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చి చిత్ర యూనిట్ సభ్యులనే షాక్కు గురి చేసింది.తెలుగు సెన్సార్ బోర్డు వారు చిన్నదాని కూడా బూతద్దంలో పెట్టి చూడటం వల్లే ఇలాంటి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, పక్క రాష్ట్రం సెన్సార్ బోర్డు వారిని అయినా చూసి నేర్చుకోవాలని తెలుగు సినిమా ప్రముఖులు కోరుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.