వివాహేతర సంబంధం ఇద్దరు మహిళల మధ్య చిచ్చుపెట్టింది.నడిరోడ్డుపై తన్నుకునేలా చేసింది.
హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది.చివరకు పోలీసులు ఎంటరై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
మరియా అనే మహిళ కు సికింద్రాబాద్ నేరేడ్మెట్ సాకేత్ విరాట్నగర్కు చెందిన స్టివెన్ జార్జ్తో మరియాలకు 10ఏళ్ల క్రితం పెళ్లైంది.ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న జార్జ్, మరియాల మధ్య గొడవ జరగడంతో కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.
ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళలతో జార్జితో వివాహాతేర సంబంధాన్ని కొనసాగించాడు.ఇంటికి తిరిగి వచ్చిన మరియాకు విషయం తెలియడంతో భర్తను నిలదీసింది.
దీంతో ఆగ్రహించిన జార్జి కవితతో కలిసి మరియాపై దాడి చేశారు.కొద్ది రోజుల తర్వాత మరియా తన బంధువులతో కలిసి మొట్టుగూడ వైపు వెళ్తుండగా కవిత కనిపించింది.
ఆమెను పట్టుకుని చితకబాదారు.కవితకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన కవితను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.