అతిథులుగా ఇద్దరు సీఎంలు?

భారీ అంచనాల నడుమ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని, విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

 Two States Cm’s For Rudramadevi Audio Release Event-TeluguStop.com

ఇక ఈ సినిమా ఆడియోను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గుణశేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.కాకతీయ వీర నారి రుద్రమదేవి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను కాకతీయుల కోట వరంగల్‌ పోర్ట్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆడియో వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించాలని గుణశేఖర్‌ భావిస్తున్నాడు.

ఇప్పటికే ఈ ఇద్దరు మఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్‌ను గుణశేఖర్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా ఆడియోను 22న వరంగల్‌లో విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.విశాఖలో ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలనే ఆలోచనలో కూడా గుఖశేఖర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈనెల 21న విశాఖలో ఆడియో విడుదల చేసే అవకాశాలున్నాయి.అనుష్క ‘రుద్రమదేవి’గా నటించిన ఈ సినిమాలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమాను వచ్చే నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube