ప్రస్తుతం చాలామంది నాయకులు వారి స్థాయికి తగిన మాటలు మాట్లాడటం లేదు.ప్రధాని నరేంద్ర మోదేయే మొన్న బీహార్ ఎన్నికల్లో తన స్థాయికి తగని మాటలు మాట్లాడి విమర్శల పాలయ్యారు.
ప్రధాని పదవిలో ఉంది రాష్ట్ర స్థాయి నాయకుడిలా ప్రసంగాలు చేశారు.ఆయనలాంటి నాయకుడే అలా మాట్లాడినప్పుడు మిగతా నాయకులు మాట్లాడారా? తెలంగాణా టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తన స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.ఇందులో కొంత నిజం ఉంది.రేవంత్ రెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.పరుషమైన భాష వాడుతున్నారు.ఈ మధ్య కూడా చడా మడా విమర్శించారు.
అయితే రేవంత్ ఒక్కడే ఇలా పరుష పదజాలంతో విమర్శించడంలేదు.ముఖ్యమంత్రి కెసీఆర్ సహా చాలా మంది నాయకులు ఇలాగే ఉన్నారు.
అన్ని పార్టీల్లో ఉన్నారు.విమర్శలు వేరు, తిట్లు వేరు అనే సంగతి నాయకులు గ్రహించడం లేదు.
ఒక్కోసారి రాయలేని భాష కూడా వాడుతున్నారు.బయటే కాదు.
అసెంబ్లీలో సైతం అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తున్నారు.ఇతర నాయకులను విమర్శిస్తున్న వారు కూడా తమను తాము సరి దిద్దుకోవడం లేదు.