తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి.పన్ను కట్టకుండా అక్రమాస్తులను కూడబెట్టుకున్నారన్న కేసులో ఐటీ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తారన్న ముందస్తు సమాచారంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కర్ణాటకలో పలు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు.
రాయచూర్ కేంద్రంగా ఆయన మెడికల్ కాలేజ్తో పాటు పలు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు.
వీటి ద్వారా ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు.ఈ ఆదాయానికి పన్ను కట్టలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గత డిసెంబర్లో ఆయనపై ఐటీ అధికారులు దాడులు చేయడంతో ఆయన్ను అరెస్టు చేస్తారనే అనుకున్నారు.చివరి క్షణంలో ఆయన రాయచూర్ కోర్టును ఆశ్రయించి అరెస్టు తప్పించుకున్నారు.
ఇక గత ఎన్నికల్లో నారాయణపేట్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్తో టీఆర్ఎస్లో చేరారు.ఇక ఐటీ అధికారుల దాడుల్లో రాజేందర్రెడ్డి రూ.500 కోట్ల ఆస్తులకు పన్ను కట్టలేదని తేలింది.దీనిపై మరింత లోతుగా విచారించిన ఐటీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగింది.
ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న రాజేందర్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.ప్రస్తుతం ఆయన మరోసారి ముందస్తు బెయిల్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
ఏదేమైనా తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారన్న వార్తలు సంచలనంగా మారాయి.