మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత సినిమాను తాజాగా కన్ఫర్మ్ చేశాడు.నితిన్తో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇటీవ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
అయితే ఆ వార్తలపై అధికారిక ప్రకటన రాకపోవడంతో ఎక్కడో చిన్న అనుమానం ఉంది.ఆ అనుమానం కూడా తాజాగా తొలగి పోయింది.
త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ నితిన్తోనే అనేది ఈ ఫొటోతో క్లారిటీ వచ్చేసింది.
తాజాగా ఈ సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నాడు.ఈ సందర్బంగా దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్తో దేవిశ్రీ ఇలా సెల్ఫీ తీసుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.ఈ సెల్ఫీతో త్రివిక్రమ్ మూవీపై ఒక పక్కా క్లారిటీ వచ్చింది.
ఇక ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించి, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల చేయాలని నిర్ణయించారు.త్రివిక్రమ్ గత చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా ఇదే సమయంలో ప్రారంభం అయ్యి, అదే సమయంలో విడుదలైన విషయం తెల్సిందే.
రాధాకృష్ణ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.