‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకున్న భారీ చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నితిన్తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్న విషయం తెల్సిందే.సమంత హీరోయిన్గా నటించబోతున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నాడు.
త్రివిక్రమ్ గత చిత్రాలకు పూర్తి విరుద్దంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.కేవలం 63 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు కనీసం ఆరు నెలల సమయం తీసుకుంటాడు.
కాని ఈ సినిమాకు మాత్రం కేవలం రెండు నెలల సమయం తీసుకుంటున్నాడు.అలాగే ఈ సినిమాను తక్కువ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నాడు.
‘అత్తారింటికి దారేది’ మరియు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ రెండు సినిమాలు కూడా 50 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కాయి.కాని నితిన్తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు మాత్రం తన పారితోషికం కాకుండా కేవలం 25 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 28న లాంచనంగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు.