మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీడ్ పెంచారు.వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు.
ప్రస్తుతం నితిన్ సమంతలతో “అ ఆ” లు రాయించే పనిలో బిజిగా ఉన్న త్రివిక్రమ్, ఆ తరువాత అన్ని పెద్ద ప్రాజెక్టులే చేయనున్నారు.
అ ఆ ఫిబ్రవరి లో పూర్తవుతుంది.
అఖిల్ ని దర్శకత్వంలో నటింపచేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు.ఈ సినిమా ఉంటే, ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం.
హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధకృష్ణ తమిళ హీరో సూర్యకి అడ్వాన్స్ ఇచ్చారు.ముందు అనుకున్నట్టుగానే, .ఈ చిత్రం కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది.
ఇక పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ తో ఓ సినిమా తీయాలి త్రివిక్రమ్.
ఈ దిశగా చర్చలు కూడా జరిగాయి.ఇక తాజా వార్త ఏమిటంటే, శ్రీమంతుడుతో అదోరకం బోణి కొట్టిన మైత్రి మూవి మేకర్స్ పవన్ కళ్యాన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కి పవన్, త్రివిక్రమ్, ఇద్దరు సై అన్నారు.
నాలుగు చిత్రాలు లైన్ లో ఉన్నాయి.
కాని త్రివిక్రమ్ ఏ చిత్రాన్ని ముందుగా మొదలుపెడతారో అంతు చిక్కడం లేదు.