పుష్కర కాలంగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న త్రిష ఇటీవల చెన్నైకు చెందిన వరుణ్తో నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే.నిశ్చితార్థం అయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వీరి పెళ్లి ఊసే లేదు.
దాంతో చెన్నైలో పలు రకాల వార్తలు మీడియాలో తెగ వస్తున్నాయి.వీరిద్దరి మధ్య వైరం మొదలైందని, దాంతో వీరి పెళ్లి జరగడం అనుమానమే అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా కొట్టి పారేయక పోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
త్రిష నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.
వీరు చాలా కాలంగా ప్రేమించుకున్నారు.ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లికి సిద్దం అయ్యారు.
వీరి పెళ్లి మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అవకాశాలున్నాయని మొదట అనుకున్నారు.అయితే ఇప్పుడు వీరి పెళ్లి గురించిన ప్రస్థావనే లేదు.
ఇక వీరిద్దరు కలిసి బయటకు వచ్చింది కూడా లేదు.దాంతో తమిళ సినీ వర్గాల్లో సైతం త్రిష నిశ్చితార్థం చెడిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వార్తలపై త్రిష ఇప్పటికి అయినా స్పందించాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.