యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ తో తారక్ స్టామినా ఏంటో మరోసారి అందరికి తెలిసేలా చేసింది.ఇన్నాళ్లు 50 కోట్ల హీరోగా కూడా వెనుకపడ్డ జూనియర్ ఇప్పుడు ఏకంగా వంద కోట్లు అయినా ఓకే అంటున్నాడు.
ఇక జనతా హిట్ తో తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసిన జూనియర్ చుట్టూ దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు.ఇక ఓ బడా నిర్మాత అయితే జూనియర్ కు ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చాడట
తను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైన నిర్మాత బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంతైనా రాసుకో అనేశాడట.
కాని తారక్ మాత్రం ఆ నిర్మాతకు సారీ చెప్పేశాడట.అంతేకాదు జూనియర్ తో జనతా గ్యారేజ్ సినిమా తీసిన నిర్మాతలు మైత్రి మూవీస్ వారు కూడా తారక్ తో సినిమా చేసేందుకు సిద్ధం అంటున్నారట.
మరి ఒక్క సినిమా తన పూర్వ వైభవాన్ని తెచ్చేలా చేస్తే తన కోసం దర్శక నిర్మాతలు ఇలా వరుస కట్టడం మరోసారి టైగర్ కు టైం వచ్చేసినట్టే అని తెలుస్తుంది.సో ఇదే ఫాంతో తారక్ మరిన్ని రికార్డులను సాధిచాలని ఆశిద్దాం.
.