అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలన ప్రజల నీరాజనాలు అందుకునేలా ఉందని సినీ ప్రముఖులు పలువురు తెలియ జేస్తున్నారు.
బుధవారం సినీ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ శుభాకాంక్షలు తెలియజేసారు.కేసీఆర్ అనేక విధాలుగా తెలుగు సినీ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహం ప్రపంచ సినిమాకు, హైదరాబాద్ హబ్ గా మార్చేలా ఉందన్నారని సుమన్ అన్నారు.
ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ను , ఐటి రంగంలో భారతదేశంలోనే నంబర్ వన్ స్ధాయిలో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమని, సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్నపథకాలు వారి జీవితాలలో వెలుగులు నింపుతాయని ఆయన అన్నారు.
ఆలాగే రెడ్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి సైతం కేసీఆర్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలిపారు.మరికొందరు రేపు నేరుగా ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలియనున్నట్టు వినవస్తోంది.
మరోవైపు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో తెలంగాణ రెండో వార్షిక ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్టు తెలుస్తోంది.రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో సహా తలసాని తదితరులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో తెలంగాణ చరిత్ర నేప థ్యం కలిగిన సినిమాలకు వినోదపన్ను తగ్గించాలని కోరనున్నట్టు సమాచారం.