టాలివుడ్ డ్రాగ్ మాఫియా కేసులో నిన్న సినీనటి, డ్యాన్సర్ ముమైత్ ఖాన్ ని విచారించారు.బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా ఉన్న ముమైత్, స్పెషల్ పర్మీషన్ మీద మొన్న రాత్రి హైదరాబాద్ కి చేరుకుంది.
నిన్న ఉదయం 10 గంటలకు విచారణ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ వెంట ఒక బిగ్ బాస్ ప్రతినిధి కూడా రావడం విశేషం.బిగ్ బాస్ నిబంధనల ప్రకారం, షో లోంచి ఎలిమినేట అయ్యేంత వరకు, బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎవరు బయటి వ్యక్తులతో మాట్లాడకూడదు.
అందుకే ముమైత్ వెంట ఒక ఆఫీషియల్ ని పంపించారు.ముమైత్ విచారణలో పాల్గొన్న అధికారులతో తప్ప, ఇంకెవరితో మాట్లాడలేదు.
తననే గమనిస్తూ ఉన్న బిగ్ బాస్ ప్రతినిధి, ఆఫీసు లోపల కూడా కాపు కాసాడు.
ఇక అసలు విషయానికి వస్తే, తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేసింది ముమైత్.
మద్యం, సిగరెట్ అలవాట్లు ఉన్నాయని, డ్రగ్స్ జోలికి వెళ్లలేదని, కెల్విన్ ఎవరో తెలియదని ముమైత్ చెప్పుకొచ్చింది.పూరి జగన్నాథ్ క్యాంప్ కి సన్నిహితురాలైనా ముమైత్ ని, పూరితో పనిచేసినప్పటి అనుభవాల గురించి అడిగారట.
దానికి ముమైత్ బదులిస్తూ, మొదటినుంచి సినిమావారి పార్టీలకి దూరంగా ఉన్నాను, వాటి మీద ఆసక్తి ఉండదు, డ్రగ్స్ ఎవరు వాడుతున్నారో, ఎవరు అమ్ముతున్నారో, ఈ వివారాలు ఏవి తెలియవు, అంత కలుపుకోలుగా ఎవరితో ఉండలేదు అని చెప్పింది.
డ్యాన్సర్లు అలసిపోకుండా డ్రగ్స్ తీసుకుంటారటా కదా, బౌన్సర్లకి కూడా డ్రగ్స్ ఇస్తారట కదా అని అధికారులు అడిగినప్పుడు, తానూ ఎప్పుడు పోరపాటులో కూడా తీసుకోలేదని, బౌన్సర్లు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు చూడలేదని ముమైత్ చెప్పిందట.
పూర్తిగా ఆత్మవిశ్వాసంతో జవాబులిచ్చిన ముమైత్, అవసరం అనుకుంటే తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్టులు చేయండి అని అడిగిందట.అయితే అధికారులే ప్రస్తుతానికి అవసరం లేదు, కాని మళ్ళీ ఏదైనా సమాచారం కావాలి అనుకున్నా, తనవైపు వేలు చూపే ఆధారాలు దొరికినా, విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారట.సాయంత్రం 4.40 గంటలకి విచారణ పూర్తవగా, ముమైత్ ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయాకుండా, వెంటనే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి, అటునుంచి పూణేలో ఉన్న బిగ్ బాస్ ఇంటికి వెళ్ళిపోయింది.
ఇక ఈరోజు స్టార్ హీరో రవితేజని విచారించనుంది సిట్ టీమ్.రవితేజ లాంటి స్టార్ డం ఉన్న హీరో డ్రగ్స్ కేసు విచారణలో ఉండటం ఇప్పటికే సంచలనం కాగా, మరి విచారణ అనంతరం ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి.