టాలీవుడ్లో సినిమాల యాడ్స్ ఇస్తే మంచి రివ్యూలు రాయడం, యాడ్స్ ఇవ్వని సినిమాలకు రివ్యూలు రాయక పోవడం లేదా బ్యాడ్ రివ్యూలు రాయడం జరుగుతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.అయితే ఇప్పటి వరకు వెబ్ మీడియా మాత్రమే ఈ తరహా వ్యాపారం చేస్తుందని అంతా అనుకున్నారు.
కాని తాజాగా ప్రముఖ దిన పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఇదే వ్యాపారంను చేస్తున్నట్లుగా ‘టిప్పు’ దర్శకుడు జగదీశ్ మరియు హీరో సత్యకార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘టిప్పు’కు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చినా కూడా వారికి యాడ్స్ ఇవ్వలేదనే కోపంతో బ్యాడ్ రివ్యూ రాసిందంటూ ఆంధ్రజ్యోతిపై వీరిద్దరు గరం అవుతున్నారు.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వీరిద్దరు ఆంధ్రజ్యోతిపై తమ ఆగ్రహంను వ్యక్తం చేశారు.నిర్మాత సదరు పత్రికకు యాడ్స్ ఇవ్వలేను అంటూ చెప్పడంతో, యాడ్స్ ఇవ్వక పోవతే బ్యాడ్ రివ్యూలు రాస్తామని బెదిరించారని, అయినా సరే నిర్మాత తన వద్ద డబ్బులు లేక పోవడంతో యాడ్స్ ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పాడట.
దాంతో ‘టిప్పు’ తప్పు అంటూ ఆంధ్రజ్యోతి రివ్యూ రాసింది.అదే రోజు విడుదలైన మిగిలిన రెండు సినిమాలకు పర్వాలేదు, మంచిగా ఉంది అంటూ రివ్యూలు రాసింది.
ఈ తరహా రివ్యూలను సినీ వర్గాల వారు వ్యతిరేకించాలి అంటున్నారు విశ్లేషకులు.