ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క దీర్ఘకాలిక దగ్గు సమస్య కొరకు ఈనెల 13 న బెంగుళూరు లో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు.శస్త్రచికిత్స కోసం దాదాపు ఒక 15 రోజుల పాటు దేశ రాజధాని దూరంగా ఉండబోతున్నారు.
అప్పటి వరకు కేజ్రీవాల్ స్థానంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేజ్రీవాల్ సెప్టెంబర్ 8 ఢిల్లీ లో బయలుదేరి పంజాబ్ ఎన్నికల నేపథ్యం లో 4 రోజుల ఆప్ నేతలతో సమాలోచనలు జరిపి సెప్టెంబర్ 12 న బెంగుళూరు చేరుకుంటారు.
మరుసటి రోజు సర్జరీ జరుగుతుంది.తిరిగి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 22 న వస్తారని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.