మూడేళ్ళ వయసులో పిల్లలు ఏం చేస్తారు? అప్పటికి పలక,బలపం పట్టడం కూడా కష్టం.ఈ ప్రపంచమేంటో, ఈ జనాల గోల ఏంటో కూడా తెలియని వయసు అది.
అలాంటిది ఓ మూడేళ్ళ పసివాడిని జెల్లో వేశారు పోలీసులు.తమిళ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వింత కన్యాకుమారిలో బయటపడింది.
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని మర్తాండం గ్రామంలో నివసించే దంపతులు మురుగన్ – మేరి జూన్ మాసంలో తమ మూడేళ్ళ అబ్బాయిని తీసుకోని మధురై సమీపంలో ఓ ఆలయదర్శనానికి వెళ్ళారు.రాత్రి అక్కడే బస చేయాల్సివచ్చింది.
రాత్రి 2 గంటల ప్రాంతంలో మేరి నిద్రలేచి చూస్తే తన భర్త, బంధువులతో పాటు బిడ్డ కూడా కనిపించలేదు.
ఏమి పాలుపోక మధురై ఎస్పీకి కంప్లెయింట్ చేసింది.
ఏదో మాటవరసకి పోలీసులు 35 రోజులు వెతికినా వారి జాడ కనిపించలేదు.నాటకీయత నడుమ మాయమైనవారంతా కన్యకుమారి జైల్లో ఉన్నట్లు తెలిసింది.
ఓ చోరి కేసులో వారందరిని అరెస్టు చేసారంట పోలీసులు.భర్త, బంధువులు సరే, మూడేళ్ళ పసివాడు ఏం చేసాడని జైల్లో వేసారని మద్రాసు కోర్టుకి వెళ్ళింది మేరి.
మద్రాసు కోర్టు ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది.పోలీసులు, మేజిస్ట్రేటు కేసు విషయంలో ఇచ్చిన వివరాలు, సమాధానాలు నచ్చక, వారిపైన శాఖపరమైమ చర్యలు తీసుకోవాలని అధికారులని అదేశించింది.
మొత్తానికి ఆ పసివాడైతే తల్లి ఒడిలోకి చేరాడు.