తెలుగులో ‘బాహుబలి’ సినిమా తర్వాత గత కొంత కాలంగా ఎక్కువ ప్రచారం జరుగుతున్న సినిమా ‘రుద్రమదేవి’.భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.
భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గిందని చెప్పాలి.అయినా కూడా ఈ సినిమాకు తప్పకుండా భారీ ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంతో దర్శక నిర్మాత గుణశేఖర్ ఉన్నాడు.
అయితే ఈ సినిమా విడుదల కాబోతున్న రోజే మూడు సినిమాలు విడుదల అవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు.
ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన తర్వాత ‘కిక్`2’ సినిమా విడుదల అదే రోజున విడుదల చేద్దామని భావించినా కూడా వాయిదా వేసుకున్నారు.కాని మూడు చిన్న సినిమాలు మాత్రం ‘రుద్రమదేవి’తో ఢీ కొట్టేందుకు సిద్దం అంటున్నాయి.
అవే అల్లరి నరేష్ ‘జేమ్స్బాండ్’, సందీప్ కిషన్ ‘టైగర్’, నాగశౌర్య ‘జాదూగాడు’.ఈ మూడు సినిమాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుపుకుంటున్నాయి.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే 26వ తారీకున విడుదలకు సిద్దం అవుతున్న నాలుగు సినిమాలు కూడా ఎప్పుడో విడుదల కావాల్సినవే.కాని అనివార్య కారణాల వల్ల నాలుగు కూడా వాయిదాలు పడ్డాయి.
మరి ఈ నాలుగు సినిమాల్లో చివరకు బరిలో నిలిచే సినిమాలు ఏవో చూద్దాం.