దొంగలు సామన్య ప్రజల్ని భయపెట్టి, కలవరపెట్టి దొంగతనాలు చేయడం గురించి ఎన్నోసార్లు విన్నాం.కాని ఓ దొంగల గుంపు మరోలా ఆలోచించింది.
సమాన్య ప్రజల్ని లూటి చేసి చేసి బోర్ కొట్టిందేమో, ఏకంగా పోలిసుకే ఎసరుపెట్టారు.తుపాకీతో ఓ పోలీసునే బెదిరించి, ఏకంగా అతడి వాహనాన్ని చోరి చేసారు.
ఈ వింత ఘటన రాజస్థాన్ లోని హనుమాన్ ఘడ్ లో జరిగింది.విధాయక్ పూరి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జితేంద్ర సింగ్ రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి విధాయక్ పూరికి వస్తుండగా, మార్గంమధ్యంలోని హనుమాన్ ఘడ్ లో ఓ దొంగలముఠా జింతేంద్ర సింగ్ మీద దాడి చేసింది.
విషయం ఏమిటంటే, ఈ పోలిసు ఇన్స్పెక్టర్ ని జైపూర్ నుంచి ఫాలో అవుతూ వచ్చింది ఆ దొంగల గుంపు.
హనుమాన్ ఘడ్ దొంగతనానికి వీలుపడే స్థలం కనిపించగానే పోలీసు కారుని ఆపేసిన దొంగలు, తుపాకీతో ఆ కారు డ్రైవర్ ని, పోలీసు అధికారి జితేంద్ర సింగ్ ని బెదిరించారు.
భయపెట్టి, ఆ కారుని తీసుకోని అక్కడినుంచి పరారయ్యారు.ఈ దొంగల ముఠాని పట్టుకోవడం కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించారట హనుమాన్ ఘడ్ పోలీసులు.