పేర్లు బయటకి రాగానే తమకేమి తెలియదు, తాము వాడలేదు, వాడేవాళ్ళు తెలియదు అంటూ మన సెలబ్రటిలు అంతా స్టేట్మెంట్స్ ఇచ్చారు.కాని విచారణ మొదవగానే అధికారుల ధాటికి మెత్తబడుతూ నిజాలన్ని చెప్పేస్తున్నారు.
నిన్న సిట్ అధికారులు డ్రగ్స్ వినియోగం – పంపిణీ కేసులో భాగంగా హీరో తరుణ్ ని ప్రశ్నించారు.దాదాపుగా 13 గంటలపాటు సుదీర్ఘంగా ఈ ప్రశ్నవళి కొనసాగిందట.
ఇందులో తరుణ్ తన తప్పులు కూడా ఒప్పుకున్నాడు.
తరుణ్ హైదరాబాద్ – గోవాకి తరుచుగా వెళుతూ వస్తుంటాడు.
ఆ టాపిక్ మీద ప్రశ్నలు మొదలుపెట్టిన పోలీసులు, ఆ తరువాత పబ్ వ్యాపారంపై, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రశ్నించారు.ఒకప్పుడు తరుణ్ కి పబ్ ఉండేది.
ఇప్పుడు లేదు.తరుణ్ అధికారులకు అదే విషయాన్ని చెప్పాడు.
పబ్ వ్యాపారం మీద ఆసక్తి తగ్గే మానేసానని, అయితే డ్రగ్స్ సప్లై చేయలేదని తరుణ్ వివరణ ఇచ్చాడు.ఇక డ్రగ్స్ వాడకంపై తరుణ్ సూటిగానే సమాధానమిచ్చాడు.
డ్రగ్స్ ఒకప్పుడు పొరపాటులో వాడాను, కాని మానేసి చాలా కాలమైంది.ప్రస్తుతం వాడట్లేదు.
సినిమా అవకాశాలు లేక, హిట్స్ కి దూరమై, ఆర్థికంగా నష్టపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని, ఆ సమయంలో అనుకోకుండా డ్రగ్స్ వాడినా, ఎప్పుడూ బానిస అవ్వలేదని, ఇప్పుడైతే అస్సలు వాడట్లేదని తరుణ్ చెప్పుకొచ్చినట్లు సమాచారం.
మరి కెల్విన్ ఫోన్ లో తరుణ్ నంబర్ ఎందుకు ఉంది అని సిట్ ప్రశ్నించగా, కెల్విన్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవు.
అసలు కెల్విన్ ఎవరు అనే విషయం కూడా తెలియదు, ఒకప్పుడు వాడేవాడిని కాబట్టి, ఇప్పుడు పనికొస్తానని తన నంబర్ తీసుకున్నాడేమో అని తరుణ్ వివరణ ఇచ్చాడట.తరుణ్ దగ్గరినుంచి బ్లడ్, గోరు, వెంట్రుకలు, వేలిముద్రలు తీసుకున్నారు ఫొరెన్సిక్ నిపుణులు.
ఇక నిన్నే డ్రగ్ డీలర్ జీషణ్ అలీని కూడా విచారించారు అధికారులు.అతడు హీరో రవితేజకి మరియు నవదీప్ కి డ్రగ్స్ సరఫరా చేసినట్లు కొన్ని ఆధారాలు దొరికాయట.
అంతేకాదు, ఈ జీషన్ అధికారులకి తెలియని కొందరు యువహీరోల పేర్లు కూడా బయటపెట్టాడట.