2004 సంవత్సరంలో ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ల కాంబినేషన్లో ‘ఆంధ్రావాలా’ చిత్రం వచ్చింది.ఆ సినిమా ఘోరంగా చిత్ర యూనిట్ను మరియు ప్రేక్షకులను, నందమూరి అభిమానులను నిరాశ పర్చింది.
ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్, పూరిల కాంబినేషన్లో సినిమా మళ్లీ వచ్చేందుకు దాదాపు 11 సంవత్సరాలు పట్టింది.ఈ 11 సంవత్సరాల్లో ఇద్దరిలో ఎంతో మార్పు, ఇద్దరి క్రేజ్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాపై ‘ఆంధ్రావాలా’ ప్రభావం ఏమాత్రం లేకుండా ఉంది.‘టెంపర్’ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు.
తాజాగా ‘టెంపర్’ చిత్ర ఆడియో వేడుకలో దర్శకుడు పూరి జగన్నాధ్ మరియు హీరో ఎన్టీఆర్లు మాట్లాడుతూ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు.ఈ సినిమా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సక్సెస్ను తప్పకుండా తెస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ గత చిత్రాల్లో కంటే ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడని అంతా కూడా చెప్పుకొచ్చాడు.ప్రతీ సినిమా బాగా చేశాం అని చెప్తాం కాని, ఈ సినిమా మాత్రం అన్ని సినిమాలకు భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చూపించడం మరో ప్రధాన ఆకర్షణ అన్నారు.మరి వీరు పెంచిన అంచనాలను ‘టెంపర్’ రీచ్ అవుతుందో చూడాలంటే మరో 15 రోజులు ఎదురు చూడాల్సిందే.