యంగ్టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టెంపర్’.ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీ ఓపెనింగ్స్ను ఈ సినిమా దక్కించుకుంది.ఇక ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 40 కోట్లు వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
చిత్ర యూనిట్ ప్రకటించిన కలెక్షన్స్ ఫేక్ అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.ఈ సినిమా 40 కోట్లు వసూళ్లు చేయడం ఏంటని, ఇప్పటి వరకు 30 కోట్లు కూడా ఈ సినిమా క్రాస్ చేయలేదని అంటున్నారు.
నైజాం ఏరియాలో ఈ సినిమా 10 కోట్లు వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 8.5 కోట్లు మాత్రమే నైజాంలో వసూళ్లు చేసిందని, అలాగే అన్ని ఏరియాల్లో కూడా పబ్లిసిటీ కోసం ఎక్కువ కలెక్షన్స్ను చిత్ర యూనిట్ సభ్యులు చూపుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా భారీ కలెక్షన్స్ను సాధించకపోయినా, ఒక మోస్తరు కలెక్షన్స్ను వసూళ్లు చేస్తున్నాయి.
లాంగ్ రన్లో ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా అనిపిస్తోంది.