యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన భారీ చిత్రం ‘టెంపర్’.ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.
ఇప్పటికే పలు సార్లు వాయిదాలు పడ్డ ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేసేందుకు ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమా ఆడియోను ఈనెల 18నే విడుదల చేయాలనుకున్నారు.
కాని కొన్ని కారణాల వల్ల ఈనెల 26కు వాయిదా వేయడం జరిగింది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు.
ఈనెల 31న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకోసం శిల్పకళావేదికను బుక్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన గత చిత్రం ‘ఆంధ్రావాల’ అభిమానులకు నిరాశ పర్చింది.
మరి ఈ సినిమా అయినా అభిమానులకు పండుగను తెస్తుందో చూడాలి.ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.
వక్కంతం వంశీ అందించిన కథతో ఈ సినిమాను పూరి తెరకెక్కించడం జరిగింది.