నందమూరి అభిమానులే నందమూరి వారసుడు ఎన్టీఆర్ మీద సెటైర్ లు వెయ్యడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.తెలుగుదేశం అభిమానులు జోకులో, సెటైర్ లో వెయ్యడం మానేసి ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగారు అని చెబుతున్నారు.
ఇన్నాళ్ళూ కేవలం మెగా ఫామిలీ నీ టాలీవుడ్ లో ఇతర హీరోలనీ టార్గెట్ చేసిన వీరు తమ లక్ష్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు.తెలుగుదేశంపై తీవ్రాతితీవ్రమైన అభిమానాన్ని కలిగిన వారు… సినిమాల విషయంలో నందమూరి ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చిన్న ఎన్టీఆర్ అంటున్నారు.
యంగ్ టైగర్ అంటూ ప్రేమగా పిలిచే తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ మీద వీర కోపం ప్రదర్శిస్తున్నారు.”రాసి పెట్టుకోండి.ఇది నందమూరి నామ సంవత్సరం.అనే జోక్ తో ఎన్టీఆర్ ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు… పేర్లు చెప్పుకుని బతకడం ఏ రోజూ నేర్పలేదు మా నాన్న.
ఈ జోక్ తో ఆయన ఈ సంవత్సరాన్ని ముగించాడు… ” అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ గురించి జోకులు పేలుస్తున్నారు.
ఇంకొక ఆసక్తికరమైన పోస్ట్ ఫేస్ బుక్ – ట్విట్టర్ లో సెన్సేషన్ గా మారింది.
ఇందులో జూనియర్ నీ కళ్యాణ్ రాం నీ టార్గెట్ చేసుకుని ఏకి పడేసారు.ఎస్వీఆర్ మనవడు హీరోగా వస్తే ఎంత ముంది పట్టించుకున్నారు, ఒకవేళ బాలయ్యే లేకపోతే ఎన్టీఆర్ మనవళ్ల పరిస్థితి అలాగే ఉంటుందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు బాబాయ్ నామస్మరణ చేయబట్టే వాళ్లను అభిమానించామని స్టార్డం దక్కిన తరవాత నో పదవులు రాలేదు అనో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకోం అనేది ఈ పోస్టు సారాంశం.
తెలుగు తమ్ముళ్ళు పార్టీ సాక్షి గా ఇలాంటి సీరియస్ పోస్ట్ లు పెడుతున్నారు అని తెలుస్తోంది.ఆపరేషన్ చిన్న ఎన్టీఆర్ మొదలయినట్టే అన్నమాట.