కృష్ణ నదికి వస్తున్న పుష్కరాల పేరుతో ఆం్రధ్రపదేశ్ ్రపభుత్వం ఇష్టానుసారంగా గుళ్లు, గోపురాలు కూల్చేస్తోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ విమర్శించారు.శుక్రవారం ఆయన మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి అసెంబ్లీ ్రపాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పోకడల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా అటు ్రపథాని మోదీ కానీ ఇక్కడి బీజేపీ నేతలు కానీ స్పందించక పోవటం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసారు.‘చంద్రబాబు దృష్టి ఆలయాలపై పడింది’ అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చి వేతలకు నిరసనగానే తాము నిరసనకు దిగామని, పద్దతి మార్చుకోకుంటే తగుతీరుగా స్పందిస్తామని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలోనూ ఇదే తరహాలో చం్రదబాబును కేసీఆర్ ఆదర్శంగా తీసుకున్నట్లుందని, పుష్కరపనుల పేరుతో కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.ఇప్పటికే పూర్వ భవనాలు పాతవైపోయాయంటూ కూల్చివేతలకు పాల్పడుతున్న కేసీఆర్ చార్మినార్ పాతదైందని కూలగొట్టడానికి సిద్దమైనా ఆశ్చర్యపోనఖ్ఖర్లేదని ఎద్దేవా చేసారాయన.
కాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారానికి అక్కడి కాం్రగెస్ నేతలు కాకుండా తెలంగాణ రాష్ట్ర కాం్రగెస్ నేతలు ధర్నాలకు దిగటం పట్ల రాజకీయ వర్గాలలో చర్చజరుగుతోంది.తెలంగాణ రాష్ట్ర ్రపభుత్వతీరును విమర్శించే నేతలు ఇప్పుడు బాబును కూడా లాగటం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నది విశ్లేషకుల భావన.
ఏం జరగనుందో చూడాలి మరి.