తెలంగాణలో లేడీ ఫైర్బ్రాండ్ లీడర్లలో ముందు వరుసలో వినిపించే పేరు గద్వాల్ కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే డీకే అరుణ.తెలంగాణలో సీఎం కేసీఆర్తో పాటు అధికార టీఆర్ఎస్పై ఎలాంటి జంకు లేకుండా ఫైర్ అవ్వడంలో ఆమెకు ఆమే సాటి.
ఆమె పట్టుబట్టి మరీ గద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయించుకున్నారంటే జేజమ్మ సత్తా ఏంటో అర్థమవుతోంది.తాజాగా ఈ లేడీ ఫైర్బ్రాండ్ ఇప్పుడు ఆంధ్రా పాలిటిక్స్లోకి ఇన్డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చేశారు.
ఏపీలో విపక్ష వైసీపీకి ఆమె బాసటగా నిలిచారు.సాయం చేయాలని వైసీపీ కోరిన వెంటనే ఆమె అభయం ఇచ్చేశారు.
మరి ఆంధ్రాలో వైసీపీకి జేజమ్మ ఎందుకు సాయం చేస్తున్నారో ? ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం.నెల్లూరు జిల్లా రాజకీయాలకు డీకే అరుణకు లింకు ఉంది.
నెల్లూరు జిల్లాలో ఆనం వోళ్లు అరుణకు వియ్యంకులు అవుతారు.
ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఎన్నికల్లో అధికార టీడీపీ వర్సెస్ విపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఆనం విజయకుమార్రెడ్డి డీకే అరుణకు స్వయానా వియ్యంకుడు.టీడీపీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి బరిలో ఉన్నారు.
ఇక్కడ గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇటీవలే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు వైసీపీలోకి జంప్ చేసేశారు.
ఇక టీడీపీ చెన్నై నగర శివార్లలో ఫైవ్స్టార్ హోటల్స్లో క్యాంపులు నడుపుతోంది.అంత ఖర్చు తట్టుకోలేని ఆనం విజయ్కుమార్రెడ్డి ఓ మాస్టర్ ప్లాన్ వేశారట.
తనకు సాయం చేయాలని…తన వియ్యపురాలు అరుణను కోరారట.వెంటనే ఆమె నెల్లూరు స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులకు గద్వాల వద్ద క్యాంపు ఏర్పాటు చేశారట.
ప్రస్తుతం నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు అక్కడే జేజమ్మ ఆతిధ్యాన్ని ఆస్వాదిస్తున్నారు.ఎన్నికల రోజు దాకా వారు గద్వాల లోనే బస చేయనున్నారు.
అలా ఆంధ్రా పాలిటిక్స్లోకి గద్వాల్ జేజమ్మ ఇన్డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చి…వైసీపీ గెలుపుకోసం హెల్ఫ్ చేస్తున్నారు.