తెలంగాణ తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ విజయవంతంగా మూడేళ్ల పాలన కొనసాగించాడు.ఇటీవల తెలంగాణలో ప్రజాప్రతినిధుల పాలనపై ప్రతి మూడు నెలలకు ఓ సారి సర్వేలు చేసి వాటి ఫలితాలు వెల్లడిస్తోన్న కేసీఆర్ తాజాగా చేయించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్కు 111 స్థానాలు వస్తాయని వెల్లడయ్యాయి.ఈ సర్వేలో మోడీ హవా తెలంగాణలో ఎంత మాత్రం ఉండదని కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి చెప్పారు.
ఇక బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పిన ఆయన ఎంఐఎం 6 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితమవుతాయన్నారు.ఈ సర్వేలో చాలా షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి.
పాత నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న 12 స్థానాల్లో టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేస్తుందన్నారు.ఇక కాంగ్రెస్ కల్వకుర్తి, మధిర స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నారు.
ఇక్కడ కూడా టీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను రంగంలో దించితే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇక ఎంఐఎం ప్రస్తుతం ఉన్న 7 స్థానాల్లో మలక్పేట స్థానం కోల్పోతుందని సర్వే తెలిపింది.
సర్వేలో గజ్వేల్ నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న కేసీఆర్ 98 శాతం ఫస్ట్ ప్లేస్లో నిలిచారు.సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేటీఆర్ 91 శాతంతో రెండోస్థానంలో, సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావు 88 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా మూడో స్థానంలో ఉండగా, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య 4వ స్థానంలో నిలిచారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చివరి స్థానంలో నిలిచారు.
ఓవరాల్గా కేసీఆర్ సర్వేలో టీఆర్ఎస్ అంచనాలకు అందకుండా కనివినీ ఎరుగని మెజార్టీతో అధికారంలోకి రానుంది.ఇక కాంగ్రెస్కు 2 సీట్లు మాత్రమే వస్తే, గత ఎన్నికల్లో చెరో సీటు గెలుచుకున్న సీపీఎం, సీపీఐ ఈ సారి జీరోకు పరిమితం కానున్నాయి.
ఇక తెలంగాణలో అస్తిత్వం కోసం ఫైట్ చేస్తోన్న టీడీపీ అడ్రస్ ఈ సారి గల్లంతుకానుంది.