మనదేశంలో ఏడాదికి కనీసం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ తో హాస్పిటల్ వెంట తిరగుతున్నారట.ఇందులో పురుషులు చాలా అంటే చాలా తక్కువ.మగవారికి రొమ్ము క్యాన్సర్ రావడం చాలా అరుదైన విషయం.అయితే లక్షల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు.
మద్యం అలవాటున్న మహిళలకి రొమ్ము క్యానర్ వచ్చే అవకాశం 30% ఎక్కువ ఉంటుందట.
ఎక్కువగా రిచ్ క్లాస్ మహిళలకే రొమ్ము క్యాన్సర్ వస్తూ ఉండటానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు.కాబట్టి మహిళలు మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇక రాబోయే తరాన్ని రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడే మార్గం మనచేతుల్లోనే ఉంది.అమ్మాయిలకి టీనేజ్ లో పండ్లు ఎక్కువగా తినిపిస్తే, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 25% తక్కువ ఉంటుందని అమెరికా పరిశోధకులు తేల్చారు.
మరి ముఖ్యంగా ఆపిల్, అరటి, ద్రాక్ష లాంటి ఫలాలతో మన అమ్మాయిల భవిష్యత్తుని సాధ్యమైనంత వరకు సురక్షితంగా ఉంచవచ్చు.