ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఢిల్లీలో పార్లమెంటు ముందున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు మొదలైనవారు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.హైకోర్టును విభజించాలని కోరుతూ బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు.
దీంతో గురువారం టీడీపీ ఎంపీలు తమ డిమాండ్ వినిపించారు.టీడీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేసి తమ వంతు బాధ్యత పూర్తి చేశారు.
బాగానే ఉంది.కాని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి కదా…! ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరోసారి చెప్పారు.
వీళ్లేమో డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు.