రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి.కొన్ని పదవులు కొన్ని పార్టీలకు కలిసి రావు.
గతంలో టీడీపీలో నెంబర్ 2గా ఉన్న వారికి ఏవో ప్రమాదాలు జరుగుతూ ఉండేవి.ఇప్పుడు ఆ పార్టీకి శాసనమండలి పెద్దగా అచ్చిరావడం లేదన్న చర్చలు జరుగుతున్నాయి.
ఆ పార్టీ నుంచి ఇటీవల శాసనమండలికి ఎవరిని ఎంపిక చేసినా వారు పార్టీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.
కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో లోకేశ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.
లోకేశ్-చంద్రబాబు కలసి పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన వారు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.ఈసారి లోకేశ్ ఎంటర్ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని చెబుతున్నారు.
లోకేష్ అనుభవలేమి ఇందులో స్పష్టంగా కన్పిస్తుందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన వాకాటి నారాయణరెడ్డి అవినీతి ఆరోపణలు, బ్యాంకు ఎగవేత కేసుల్లో నిందితుడిగా ఉండడంతో చంద్రబాబు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇక అనంతపురం జిల్లాకు చెందిన దీపక్రెడ్డి కేవలం లోకేశ్ సిఫార్సుతోనే ఎమ్మెల్సీ అయ్యారు.ఆయన భూ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయనను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు.
ఇక తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.ఇలా వరుస పెట్టి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరమయ్యారు.
టీడీపీలో ఎమ్మెల్సీ పోస్టు ఇప్పుడు ఆ పార్టీకి కలిసి రావడం లేదు.గతంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా ఇలాగే జరిగింది.
టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వంగా గీత, సీ.రామచంద్రయ్య పదవి కాలం పూర్తయిన వెంటనే పార్టీని వీడి వెళ్లిపోయారు.ఇక పైన ముగ్గురు ఎమ్మెల్సీలకు తోడు ఇప్పుడు అద్దంకి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని వార్తో ఎమ్మెల్సీలు కరణం బలరాం, రామసుబ్బారెడ్డి కూడా పార్టీ మారిపోతారన్న వార్తలు వస్తున్నాయి.ఏదేమైనా టీడీపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి బాగా దెబ్బేస్తోంది.