తెలుగు సినిమా రంగంలో మంచు మోహన్బాబు స్టైలే వేరు.తన మనస్సులో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా బయటకు చెప్పే మోహన్బాబు ఎంతోమందికి ఎన్నోసార్లు టార్గెట్ అయ్యాడు.
గతంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా టీడీపీలో చేరి … ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన మోహన్బాబు దశాబ్దంన్నర కాలంగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో వచ్చిన విబేధాల కారణంగానే మోహన్బాబు రాజకీయాలకు దూరమయ్యారన్న టాక్ ఉంది.
ఆ తర్వాత మోహన్బాబు ప్రస్తుత విపక్ష వైసీపీ అధినేత జగన్కు చాలా దగ్గర బంధువు అయ్యారు.జగన్ చిన్నాన్న కుమార్తె వెరోనికాయే మోహన్బాబుకు పెద్ద కోడలిగా వెళ్లింది.
ఈ క్రమంలోనే మోహన్బాబుకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ బంధువులు అయ్యారు.
ఇదిలా ఉంటే మోహన్బాబు తిరిగి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి.
ముందుగా ఆయన వైసీపీలోకి వెళతారని…ఆ పార్టీలోకి వెళితే ఆయనకు జగన్ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది.అయితే లేటెస్ట్ వార్తల ప్రకారం మోహన్బాబు త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారని చర్చలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సారి ఆయన సింగిల్గా రావడం లేదట.తన కూతురు మంచు లక్ష్మిని కూడా తన వెంట తెస్తున్నారట.
మోహన్బాబు, మంచు లక్ష్మి టీడీపీలో చేరితే 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి మంచు లక్ష్మి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.చంద్రగిరి మోహన్బాబు సొంత నియోజకవర్గం.
ఈ నియోజకవర్గంలో మంచు ఫ్యామిలీ చాలా సేవా కార్యక్రమాలు చేపడుతోంది.చంద్రగిరి నియోజకవర్గంలో మంచు ఫ్యామిలీకి బాగానే ఫాలోయింగ్ ఉంది.
వాళ్ల విద్యానికేతన్ విద్యాసంస్థలు కూడా అదే నియోజకవర్గంలో ఉన్నాయి.ఇక టీడీపీలో బలమైన మహిళా నేతల కొరత కూడా ఉంది.
ఇక మోహన్బాబు ఫ్యామిలీ టీడీపీలోకి వస్తే పార్టీకి కూడా మంచి వాయిస్ ఉన్నట్టు ఉంటుంది.మరి మోహన్బాబు-మంచు లక్ష్మి టీడీపీ ఎంట్రీ ఏ స్టైల్లో.? ఎప్పుడు ఉంటుందో ? చూడాలి.