ఎన్నో…ఆశలు.మరెన్నో ఆలోచనలు….వాటన్నింటినీ కేంద్రం అమలు చేస్తుంది.తమకు తోడుగా ఉంటుంది అన్న ఆలోచనతో…కమలం పార్టీతో దోస్తీ కట్టింది తెలుగుదేశం పార్టీ.అయితే.అధికారం చేతుల్లోకి వచ్చిన మొదటి నుంచి కేంద్రం తెలుగుదేశంపై చిన్న చూపు చూస్తూనే ఉంది.
కానీ తెలుగుదేశం మాత్రం బీజేపీని ఎప్పటికప్పుడు వెనకేసుకుని వస్తూనే ఉంది.చివరకు డిల్లీ ఎన్నికల్లో కూడా.
అందరూ కమలం పార్టీపై విమర్శలు గుప్పించినప్పటికీ.చంద్రబాబు మాత్రం బీజేపీ వెంట నిలిచారు.
ఇన్ని జరిగినప్పటికీ…బడ్జెట్ విషయంలో మన రాష్ట్రానికి బీజేపీ చేసిన తీవ్ర అన్యాయంపై మొదటి సారి.చంద్రబాబు తనలోని ఆర్ధతను బయట పెట్టారు.
బడ్జెట్ తర్వా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు చూస్తే.టీడీపీ – బీజేపీ మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులలోఉన్నా.కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలు సైతం అమలుకాకపోవడంపై టీడీపీలో అసహనం రగిలిస్తోంది.
ఇది నేను కూడా ఊహించలేదు.ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదని.
చంద్రబాబే మీడియా ముందు బాధగా మాట్లాడటం చూస్తుంటే తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామన్న వేదన ఆయన మాటల్లో కనిపిస్తోంది.అయితే ఇప్పటివరకు మోడి పై ఎప్పుడూ విమర్శలు చేయని బాబు.
సడన్ గా ఇలా మాట్లాడుతుంటే.బీజేపీకీ టీడీపీకి చెడినట్టే కనిపిస్తోంది.
ఇక ఇదే క్రమంలో మన రాష్ట్రానికి న్యాయం కోసం పోరాటం చేస్తామని.అప్పటివరకు విశ్రమించేది లేదు అని బాబు స్పష్టం చేశారు.