రాష్ర్టపతి వచ్చారుగా అడగండి...!

రాష్ర్టపతి హైదరాబాదుకు వచ్చారుగా అడగండి…అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ.ఇంతకూ పెద్దాయన్ని ఏమడగాలి? ఈ మధ్య రచ్చ రచ్చ అయిన విభజన చట్టంలోని సెక్షన్‌ ఎనిమిది గురించి రాష్ర్టపతి వివరణ కోరాలని, అందులో ఏముందో ఆయన్ని అడిగి తెలుసుకోవాలని బొత్స సలహా ఇచ్చారు.హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్‌ ఎనిమిదిని అమలు చేసే అధికారం గవర్నర్‌కు ఉందని సెక్షన్‌ ఎనిమిది చెబుతోంది.నోటుకు ఓటు కేసు నేపథ్యంలో హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదు కాబట్టి సెక్షన్‌ ఎనిమిది అమలు చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.

 Td Should Resolve Section 8 Issues-TeluguStop.com

దీన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది.ఇప్పటికీ ఈ సెక్షన్‌ అమల్లోనే ఉందని ఆ పార్టీ చెబుతోంది.ఈ వాదులాట ఇలా కొనసాగుతుండగానే రాష్ర్టపతి వచ్చారు కాబట్టి ఆయనతోనే ఈ సమస్యపై ప్రస్తావించి స్పష్టత తీసుకోవాలిన బొత్స అన్నారు.ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని కూడా సలహా ఇచ్చారు.రాష్ర్టపతి ఏదో కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆనవాయితీగా వచ్చారు.‘రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్లు’ ఈ గొడవ ఆయన దగ్గర ఎందుకు? ఒకవేళ అడిగారే అనుకుందాం…వెంటనే పాఠం అప్పగించినట్లు సెక్షన్‌ ఎనిమిది గురించి చెప్పేస్తారా? రాజకీయ నాయకులు తమకు తోచింది మాట్లాడతారు తప్ప విచక్షణ ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube